అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ‘జర్నలిజంపై మహిళల ప్రభావం’ అంశంపై మెమోరియల్ లెక్చర్
హైదరాబాద్ (సూర్యన్యూస్): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) వేదికగా ప్రొఫెసర్ ఎస్. బషీరుద్దీన్ 90వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ప్రత్యేక స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయ జూబ్లీహిల్స్ క్యాంపస్లోని ప్రొఫెసర్ కేతు విశ్వనాథ రెడ్డి సెమినార్ హాల్లో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఈ ఏడాది “జర్నలిజంపై మహిళల ప్రభావం” (Impact of Women on Journalism) అనే ఆసక్తికరమైన అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజ షా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించనున్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు.
రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్. విజయ కృష్ణ రెడ్డి, డైరెక్టర్ అకాడమిక్ ప్రొఫెసర్ జి. పుష్ప చక్రపాణి తదితరులు పాల్గొనే ఈ కార్యక్రమంలో జర్నలిజం రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారు చూపుతున్న ప్రభావంపై లోతైన విశ్లేషణ జరగనుంది.
- Surya news, Hyderabad


Comments
Post a Comment