రాజేంద్రనగర్ ట్రాఫిక్ సమస్యలపై డిసిపి రాహుల్ హెగ్డే సమీక్ష.. సరిహద్దు పాయింట్ల వద్ద క్షేత్రస్థాయి పరిశీలన!
హైదరాబాద్ (Suryanews): రాజేంద్రనగర్ ప్రాంతంలో ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ట్రాఫిక్ విభాగం నడుం బిగించింది. డిసిపి రాహుల్ హెగ్డే నేతృత్వంలో ఈరోజు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పిఎస్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ప్రధాన అంశాలు:
జంక్షన్ల పరిశీలన: మేజర్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీకి గల కారణాలను విశ్లేషించి, జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సమన్వయ చర్యలు: రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు.
సిబ్బందికి సూచనలు: విధుల్లో ఉన్న అధికారుల పనితీరును పర్యవేక్షించి, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేపట్టాలని సూచించారు.

Comments
Post a Comment